50 గొర్రెపిల్లలు మృతి

ABN , First Publish Date - 2021-10-15T05:58:36+05:30 IST

కాశినాయన మండలం ఇటుకులపాడులో గురువారం ఆవుల పెంచలయ్యకు చెందిన దాదాపు 50 గొర్రెపిల్లలు అనుమానస్పదస్థితిలో మృతి చెందాయి.

50 గొర్రెపిల్లలు మృతి
మృతిచెందిన గొర్రెపిల్లలు

రూ.2లక్షల మేర నష్టం


కాశినాయన, అక్టోబరు 14: కాశినాయన మండలం ఇటుకులపాడులో గురువారం ఆవుల పెంచలయ్యకు చెందిన దాదాపు 50 గొర్రెపిల్లలు అనుమానస్పదస్థితిలో మృతి చెందాయి. బాధితుల వివరాల మేరకు... రోజులాగే గురువారం పెద్ద గొర్రెలను మేత కోసం పొలాలకు తోలుకుపోతూ చిన్న పిల్లలను వెదురు దబ్బలతో అల్లిన గూట్లో మూసిపెట్టారు. సాయంకాలం వచ్చి రైతు గూడు తెరవగా అన్నీ చనిపోయి కన్పించాయి. దీంతో బాధిత కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. దాదాపు రూ.2లక్షల మేర నష్టం వాటిల్లిందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. సంఘటన ప్రాంతాన్ని పశువైద్యుడు శివశ్రీనివాసరెడ్డ్డి పరిశీలించారు.


Updated Date - 2021-10-15T05:58:36+05:30 IST