డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో 50శాతం స్థానికులకివ్వాలి

ABN , First Publish Date - 2021-06-18T04:16:45+05:30 IST

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో 50శాతం స్థానికులకివ్వాలి

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో 50శాతం స్థానికులకివ్వాలి
ఇళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య 


శంకర్‌పల్లి: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో స్థానికులకు 50శాతం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. గురువారం శంకర్‌పల్లి పరిధి బీడీఎల్‌ చౌరస్తాలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్మిప్రవీణ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడు తూ... ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీ రోడ్డుకు రూ.కోటి మంజూరు చేయిస్తామన్నారు. మున్సిపాలిటీ, మండల ప్రజలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కేటాయించేలా ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ధర్మన్నగారి వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి, వాసుదేవ్‌, డ్రైవర్‌ అంజి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:16:45+05:30 IST