50 శాతం జర్మనీ జనాభాకు అందిన రెండు డోసుల వ్యాక్సిన్

ABN , First Publish Date - 2021-07-29T10:45:50+05:30 IST

యూరప్ దేశం జర్మనీలోని ప్రజల్లో 50శాతంపైగా పౌరులకు పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగింది. ఈ విషయాన్ని

50 శాతం జర్మనీ జనాభాకు అందిన రెండు డోసుల వ్యాక్సిన్

బెర్లిన్: యూరప్ దేశం జర్మనీలోని ప్రజల్లో 50శాతంపైగా పౌరులకు పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగింది. ఈ విషయాన్ని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాన్ వెల్లడించారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పలువురు నిపుణులు బల్లగుద్ది చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ దేశంలో సగానికిపైగా ప్రజలకు వ్యాక్సిన్ రెండు డోసులూ అందిందని, వాళ్లు పూర్తి వ్యాక్సినేషన్ పొందారని స్పాన్ తెలిపారు. అలాగే జర్మనీ జనాభా మొత్తం 83 మిలియన్లుకాగా, వీరిలో 61.1శాతం మంది కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని ఆయన చెప్పారు. ‘‘ఎంత ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటే అంత మంచిది. అప్పుడే వచ్చే చలికాలంలో మనం భద్రంగా ఉంటాం’’ అని స్పాన్ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-29T10:45:50+05:30 IST