శీతాకాల సమావేశాలు: రాజ్యసభ సమయం 52% వృధా
ABN , First Publish Date - 2021-12-06T02:56:00+05:30 IST
అనుకున్న సమయంలో సభ 47.7 శాతం సజావుగా సాగింది. అయితే గురువారం సభ నిర్ణీత సమయం కంటే 33 నిమిషాలు ఎక్కువ సమయం నడవడంతో సభ ఉత్పాదకత 49.70 శాతానికి పెరిగింది. గురు, శుక్రవారాల్లో సభ వరుసగా 95, 100 శాతం..
న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం రోజుల్లో రాజ్యసభ సమయం 52 శాతం వృధా అయింది. వివిధ కారణాల వల్ల ప్రతిపక్ష పార్టీ నేతలు నిరసన చేయడం, కొంత మంది ఎంపీలు సస్పెండ్ అవ్వడం లాంటి కారణాల వల్ల సభ తన సమయాన్ని వృధాగా కోల్పోయిందని అంటున్నారు. అయితే ప్రతిపక్షా తీరు ప్రజాస్వామ్యయుతంగా లేదని, ఉద్దేశపూర్వకంగా సభలో గందరగోళం నిర్వహించాలనే ధోరణితో వ్యవహరించారనే కారణంతో 12 మంది ఎంపీలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేశారు. అనంతరం ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వరుసన నిరసనలు చేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాజ్యసభ సమయం వృధా కావడానికి ఇది ప్రధాన కారణమైంది. అనుకున్న సమయంలో సభ 47.7 శాతం సజావుగా సాగింది. అయితే గురువారం సభ నిర్ణీత సమయం కంటే 33 నిమిషాలు ఎక్కువ సమయం నడవడంతో సభ ఉత్పాదకత 49.70 శాతానికి పెరిగింది. గురు, శుక్రవారాల్లో సభ వరుసగా 95, 100 శాతం ఉత్పాదకతలతో నడిచింది.