ఉమ్మడి జిల్లాలో 537 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-04-19T05:54:02+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం 537 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో 537 మందికి పాజిటివ్‌

కరోనాతో ఆర్టీసీ కండక్టర్‌ మృతి  

కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమ విభాగం/ బూర్గంపాడు, ఏప్రిల్‌ 18: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం 537 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2300మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 412మందికి పాజిటివ్‌ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం 125 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 3,857 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 125 మందికి పాజిటివ్‌ నమోదైనట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు తెలిపారు. కొత్తగూడెం డివిజన్‌లో 2,816 మందికి వైద్య చికిత్సలు నిర్వహించగా, 105 మందికి, భద్రాచలం డివిజన్‌లో 1,034 మందికి పరీక్షలు నిర్వహించగా, 18 మందికి పాజిటివ్‌ వచ్చింది.  

కండక్టర్‌ మృతి  

భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఆర్టీసీ కండక్టర్‌ కరోనాతో ఆదివారం మృతి చెందాడు. భద్రాచలం ఆర్టీసీ డీపోలో పనిచేస్తున్న ఆయన గత నాలుగు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు సమాచారం. మృతదేహన్ని శ్రీనివాసరావు స్వగ్రామం జంగారెడ్డిగూడెం తరలించినట్లు స్థానికులు తెలిపారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


Updated Date - 2021-04-19T05:54:02+05:30 IST