దేశంలో కొత్తగా 54 వేల కేసులు
ABN , First Publish Date - 2020-10-22T08:11:00+05:30 IST
దేశంలో కొత్తగా 54,044 కరోనా కేసులు నమో దయ్యాయి. ఆగస్టు 4వ తేదీ తర్వాత సోమవారాలు మినహా మిగతా రోజుల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యల్పం. సోమవారం 10.32 లక్షల టెస్టులు చేశారు. మరణాలు 700 దాటాయి...
న్యూఢిల్లీ, అక్టోబరు 20: దేశంలో కొత్తగా 54,044 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 4వ తేదీ తర్వాత సోమవారాలు మినహా మిగతా రోజుల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యల్పం. సోమవారం 10.32 లక్షల టెస్టులు చేశారు. మరణాలు 700 దాటాయి. 7.40 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. మరో 61,775 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 88.81కు చేరింది. మరణాల రేటు 1.51కు తగ్గింది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న పది రాష్ట్రాల్లో బెంగాల్ మినహా మిగతాచోట్ల పాజిటివ్లు తగ్గుతున్నాయి. మరోవైపు కొత్త మరణాల్లో 82 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. 14 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణాలు ఒక శాతం లోపు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.+ కరోనా చికిత్స విధానంలో ప్లాస్మా థెరపీని తొలగించాలని కేంద్రం ఆలోచిస్తుండటాన్ని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తప్పుబట్టారు. కరోనా బారినపడి కోలుకున్న జైన్.. ఢిల్లీలో ప్లాస్మా థెరపీ 2 వేల మంది ప్రాణాలు నిలిపిందని పేర్కొన్నారు. దేశంలో తొలి ప్లాస్మా బ్యాంక్ ఢిల్లీలో జూలై 2న ప్రారంభమైంది.