ఉమ్మడి జిల్లాలో..550 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-09-29T07:20:40+05:30 IST

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం 550 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.నల్లగొండ జిల్లాలో

ఉమ్మడి జిల్లాలో..550 పాజిటివ్‌ కేసులు

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, సెప్టెంబరు 28: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం 550 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.నల్లగొండ జిల్లాలో 330,సూర్యాపేటలో120, యాదా ద్రి జిల్లాలో 100 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇది లా ఉండగా, ఉమ్మడి జిల్లాలో ఆదివారం 176 పాజిటివ్‌ కేసు లు నమోదు కాగా, ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన రాష్ట్ర బులెటిన్‌లో 119 కేసులు మాత్రమే చూపింది. 


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన రాపిడ్‌ పరీక్షల్లో నకిరేకల్‌ 32, మిర్యాలగూడ 24, కట్టంగూరు 18, మునుగోడు, కోదాడ, సూర్యాపేట, భువనగిరి 17 చొప్పున, చిట్యాల, దేవరకొండ, నేరేడుచర్ల 16 చొప్పున, త్రిపురారం 14, నాగార్జునసాగర్‌ 13, వేములపల్లి 12, అనంతగిరి, వలిగొండ, ఆత్మకూరు(ఎస్‌) 11 చొప్పున, కొండమల్లేపల్లి, గుండాల, కేతేపల్లి 10 చొప్పున పాజిటివ్‌ కేసులు వచ్చాయి. హుజూర్‌నగర్‌, భూదాన్‌పోచంపల్లి తొమ్మిది చొప్పున, శాలిగౌరారం, తిప్పర్తి ఎనిమిది చొప్పున, తుంగతుర్తి ఏడు, హాలియా, నాంపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, మునగాల ఆరు చొప్పున, మోతె ఐదు, అడవిదేవులపల్లి, నిడమనూరు, పీఏపల్లి, మఠంపల్లి, మేళ్లచెర్వు, పెన్‌పహాడ్‌, రామన్నపేట, చౌటుప్పల్‌ నాలుగు చొప్పున పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.


ఆలేరు, ఆత్మకూరు(ఎం), చందంపేట, బీబీనగర్‌ మూడు చొప్పున, చింతపల్లి, డిండి, కనగల్‌, చివ్వెంల, నడిగూడెం, మోత్కూరు, మర్రిగూడ, అడ్డగూడూరు, తిరుమలగిరి రెండు చొప్పున, చండూరు, దామచర్ల, గుర్రంపోడు, చిలుకూరు, గరిడేపల్లి, నూతనకల్‌, బొమ్మలరామారం, మోటకొండూరు, తుర్కపల్లి ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-09-29T07:20:40+05:30 IST