ఉమ్మడి జిల్లాలో 577 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-09-25T07:50:52+05:30 IST
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం 577 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 312, సూర్యాపేటలో
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్, సెప్టెంబరు 24: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం 577 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 312, సూర్యాపేటలో 140, యాదాద్రి జిల్లాలో 125 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనాతో యాదగిరిగుట్టలో 75 ఏళ్ల వృద్ధుడు, మర్రిగూడెం గ్రామానికి చెందిన ఒకరు, మునుగోడు మండలంలోని చీకటిమామిడి గ్రామంలో వృద్ధ మహిళ మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలో బుధవారం 589 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రభుత్వం గురువారం విడుదల చేసిన రాష్ట్ర బులెటిన్లో 258 కేసులు మాత్రమే చూపించారు. ఇదిలా ఉండగా, భూదాన్పోచంపల్లి పీహెచ్సీ సిబ్బందికి కరోనా పాజిటివ్ రాగా, మూడు రోజులపాటు వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ యాదగిరి తెలిపారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన రాపిడ్ పరీక్షల్లో భువనగిరి 31, సూర్యాపేట 26, నకిరేకల్ 21, నాగార్జునసాగర్, మిర్యాలగూడ 20 చొప్పున, కోదాడ, రాజాపేట 19 చొప్పున, చౌటుప్పల్ 18, హుజూర్నగర్ 17, దేవరకొండ, మునగాల 14చొప్పున, కట్టంగూరు, బీబీనగర్, ఆత్మకూరు(ఎస్) 12 చొప్పున, దామచర్ల 11, చివ్వెంల 10 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. భూదాన్పోచంపల్లి, శాలిగౌరారం, నేరేడుచర్ల, వలిగొండ, గరిడేపల్లి తొమ్మిది చొప్పున, కేతేపల్లి, నూతనకల్, వేములపల్లి ఏడు చొప్పున, చింతపల్లి, త్రిపురారం, తిప్పర్తి, యాదగిరిగుట్ట, చిలుకూరు ఆరు చొప్పున, చందంపేట, తిరుమలగిరి, చిట్యాల, పాలకవీడు, హాలియా, ఆలేరు, మాడ్గులపల్లి ఐదు చొప్పున, గుర్రంపోడు, కనగల్, తుంగతుర్తి, అడవిదేవులపల్లి, అనంతగిరి నాలుగు చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. చండూరు, సంస్థాన్నారాయణపురం, తుర్కపల్లి, నాంపల్లి, పీఏపల్లి, పెన్పహాడ్, నిడమనూరు, మునుగోడు, మోత్కూరు మూడు చొప్పున, మర్రిగూడ, మఠంపల్లి, మోటకొండూరు, బొమ్మలరామారం, మేళ్లచెర్వు రెండు చొప్పున, డిం డి, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్), అర్వపల్లి, మోతె, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుం డాల ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.