కువైత్ నుంచి 580 మంది వలస కూలీల రాక
ABN , First Publish Date - 2020-06-07T06:35:26+05:30 IST
కువైత్ నుంచి శనివారం సాయంత్రం నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరితోపాటు మరికొన్ని
నెల్లూరు (విద్య) జూన్ 6 : కువైత్ నుంచి శనివారం సాయంత్రం నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరితోపాటు మరికొన్ని జిల్లాలకు చెందిన వలసకూలీలు 580 మంది చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్రభుత్వం రెండు ప్రత్యేక విమానల్లో వారిని రాష్ర్టానికి తీసుకొచ్చింది. వారిని జిల్లా ఫారెన్ క్వారంటైన్ అధికారి డాక్టర్ బ్రహ్మానందరెడ్డి రిసీవ్ చేసుకున్నారు. అనంతరం వారికి ఎయిర్పోర్టులోనే వైద్య పరీక్షలను నిర్వహించారు. మొదటి విమానంలో 287 మంది, రెండో విమానంలో 293 మంది వచ్చారనీ, పరీక్షల అనంతరం వారిని ప్రత్యేక బస్సులో సొంత జిల్లాలకు తరలిస్తామని ఆయన తెలిపారు.