భర్తను బంధించి.. భార్య, కూతురిని పొలంలోకి లాక్కెళ్లి..

ABN , First Publish Date - 2020-08-03T03:42:53+05:30 IST

భర్తను బంధించి అతడి భార్యా కూతరిపై దుండగులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్ పూర్ జిల్లాలో జరిగింది.

భర్తను బంధించి.. భార్య, కూతురిని పొలంలోకి లాక్కెళ్లి..

భోపాల్: భర్తను బంధించి అతడి భార్య, కూతరిపై దుండగులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆదివారం నాడు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో జరిగింది. అక్కడి స్టోన్ క్రషింగ్ ప్రాంతానికి సమీపంలోనే బాధితులు నివసిస్తుంటారని పోలీసులు తెలిపారు. ఆ రోజున.. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు భర్తను బంధించి అతడి భార్యను 12 ఏళ్ల కూతురిని అపహరించికెళ్లారు. వారిని పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. బాధితుల ఇంట్లోంచి నగదు, మొబైల్ ఫోన్ కూడా దొంగిలించారు. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డ ఆరుగురిని  అదుపులోకి తీసుకున్నారు. వారిపై అత్యాచారం నేరంతో పాటూ పాక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-08-03T03:42:53+05:30 IST