బిగ్ బ్రేకింగ్.. మాదాపూర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-08-01T12:02:04+05:30 IST

మాదాపూర్‌(Madappur)లో దారుణం చోటు చేసుకుంది. నీరూస్ సిగ్నల్(Neeroos signal) వద్ద రియల్ ఎస్టేట్(Real estate) వ్యాపారిని..

బిగ్ బ్రేకింగ్.. మాదాపూర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

Hyderabad : మాదాపూర్‌(Madapur)లో దారుణం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వివాదంలో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నీరూస్ సిగ్నల్(Neeroos signal) వద్ద దుండగులు కాల్పులు జరిపారు. రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారి ఇస్మాయిల్‌ను దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఇస్మాయిల్‌పై పాయింట్ బ్లాంక్‌(Point blank)లో కాల్పులు జరిపారు. ఇస్మాయిల్‌తో పాటు మరో వ్యక్తి జహంగీర్‌పై సైతం కాల్పులు జరిపారు. ఇస్మాయిల్ మృతి చెందగా... జహంగీర్ పరిస్థితి విషమంగా ఉంది. రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణంగా తెలుస్తోంది. ఇస్మాయిల్‌, జహంగీర్‌, మహ్మద్‌ అనే ముగ్గురు వ్యక్తుల మధ్య రియల్‌ ఎస్టేట్‌ వివాదం కొంతకాలంగా నడుస్తోంది. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మహ్మద్‌ వారిద్దరినీ నీరూస్‌ దగ్గరికి పిలిచాడు. వీరి మధ్య కొంతసేపు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. చర్చలు జరుగుతుండగానే మహ్మద్‌ ఫైరింగ్‌ ఓపెన్‌ చేసినట్టు సమాచారం. ఇస్మాయిల్‌ పక్కన ఉన్నవారిని చెదరగొట్టేందుకు.. మరో వెపన్‌తో జిలానీ అనే వ్యక్తి సైతం మహ్మద్‌కు మద్దతుగా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇద్దరిపై కాల్పులు జరిపిన అనంతరం మహ్మద్‌, జిలానీ అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రగాయాలపాలైన ఇస్మాయిల్‌ను అతని మిత్రులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. జహంగీర్‌కు చికిత్స జరుగుతోంది.




Updated Date - 2022-08-01T12:02:04+05:30 IST