నేపాల్లో భారీ వర్షాలు
ABN , First Publish Date - 2020-07-14T06:53:05+05:30 IST
నేపాల్లో 4 రోజుల పాటు కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు కొండచరియలు విరిగి విధ్వంసం సృష్టించాయి. 60 మంది మృతి చెందగా 41మంది గల్లంతయ్యారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు...
- 60మంది మృతి, 41మంది గల్లంతు
కాఠ్మాండూ, జూలై 13: నేపాల్లో 4 రోజుల పాటు కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు కొండచరియలు విరిగి విధ్వంసం సృష్టించాయి. 60 మంది మృతి చెందగా 41మంది గల్లంతయ్యారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. పశ్చిమ నేపాల్లోని మయాగ్దీ జిల్లాలోనే 27మంది చనిపోయారు. నిరాశ్రయులను స్థానిక పాఠశాలలకు, కమ్యూనిటీ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.