కరోనాతో 61 మంది మృతి
ABN , First Publish Date - 2021-06-12T00:35:14+05:30 IST
ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా
అమరావతి: ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 8,239 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం 17,96,122 కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 61 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 11,824 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం 96,100, యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 16,88,198 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 11,135 మంది డిశ్చార్జ్ అయ్యారు.