గర్ల్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా... అకస్మాత్తుగా ఆమె తమ్ముడు గదిలోకి రావడంతో..

ABN , First Publish Date - 2020-08-01T22:38:12+05:30 IST

గదిలో గర్ల్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉండగా ఆమె తమ్ముడు గదిలోకి రావడంగో యువకుడు (21) ఒక్కసారిగా కంగారుపడ్డాడు. తమ విషయం బయటపడతాడేమోనని భావించిన ఆ ఆరేళ్ల చిన్నారిని హత్య చేశాడు.

గర్ల్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా... అకస్మాత్తుగా ఆమె తమ్ముడు గదిలోకి రావడంతో..

బరేలీ: గర్ల్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉండగా ఆమె తమ్ముడు గదిలోకి రావడంగో యువకుడు (21) ఒక్కసారిగా కంగారుపడ్డాడు. తమ విషయం బయటపెడతాడేమోనని భయపడి ఆ ఆరేళ్ల చిన్నారిని అక్క ముందే హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లో బరేలీ జిల్లాలో గత మంగళవారం ఈ దారుణం జరిగింది.  తమ్ముడి మరణంతో కుంగిపోయిన అక్క గురువారం నాడు ఈ విషయం తల్లిదండ్రులతో చెప్పడంతో వారు పోలీసు కేసు నమోదు చేశారు.


బాలిక కూడా మైనరేనని, ఆమె తల్లిదండ్రులు రోజు కూలీ చేసుకుని పొట్టపోసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యహ్నానం తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో ఆమె వద్దకు బాయ్ ఫ్రెండ్ వచ్చాడని వారు చెప్పారు. అదే సమయంలో ఆమె తమ్ముడు ఒక్కసారిగా గదిలోకి రావడంతో ఇద్దరూ కంగారు పడ్డారు. తమ గురించి ఆమె తల్లిదండ్రులకు తెలుస్తుందని కంగారు పడ్డ నిందితుడు ఆ ఆరేళ్ల బాలుడిని హత్య చేశాడు. బాలిక కూడా తన బాయ్‌ఫ్రెండ్‌కు అడ్డుపడలేదు. ఇంటిపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి తమ్ముడు చనిపోయాడంటూ సాయంత్రం ఇంటికిచ్చిన తల్లిదండ్రులకు ఆమె చెప్పింది. బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అతడు అప్పటికే అతడు మరణించాడని డాక్టర్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు ఆ చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించారు.



అయితే తమ్ముడి మరణంతో మానసికంగా కుంగిపోయిన బాలిక.. హత్య జరిగిన రెండు రోజుల తరువాత తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై హత్య, అత్యాచారం కేసుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారించారు. త్వరలో ఆమెను బాల నేరస్థుల కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా.. ఈ నేరానికి పాల్పడ్డ నిందితుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-08-01T22:38:12+05:30 IST