7 జిల్లాల్లో వందల్లో కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-08-01T15:46:08+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. వందల్లో కేసులు మూడు జిల్లాలకే పరిమితంగా ఉండేవి. తాజాగా ఆ సంఖ్య శనివారంతో 7 జిల్లాలకు పెరి
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. వందల్లో కేసులు మూడు జిల్లాలకే పరిమితంగా ఉండేవి. తాజాగా ఆ సంఖ్య శనివారంతో 7 జిల్లాలకు పెరిగా యి. రాష్ట్రవ్యాప్తంగా 1,987 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 450, దక్షిణకన్నడ 365, మైసూరు 177, ఉడుపి 148, కొడగు 132, తుమకూరు 108, హాసన్ 105 మందికి నిర్ధారణ అయింది. పది జిల్లాల్లో పది మందిలోపు నమోదు కాగా బీదర్ జిల్లాలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. 12 జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,632 మంది డిశ్చార్జ్ కాగా 37 మంది మృతి చెందారు. కొన్ని రోజుల తర్వాత బెంగళూరులో 11 మంది మృతిచెందారు. దక్షిణకన్నడలో ఏడుగురు మృతి చెందగా 15 జిల్లాల్లో ఒకరు కూడా మృతి చెందలేదు. 9 జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందగా మిగిలిన జిల్లాల్లో ఐదుగురిలోపు నమోదయ్యారు. 23,796 మంది చికిత్సలు పొందుతుండగా బెం గళూరులో 8, 529 మంది ఉన్నారు.