జర్మనీ నుంచి భారత్ చేరిన 7 ఆక్సిజన్ ప్లాంట్లు
ABN , First Publish Date - 2021-05-18T00:01:29+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ ధాటికి విలవిల్లాడుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాల నుంచి సహకారం అందుతూనే ఉంది.
శ్రీనగర్: కరోనా సెకండ్ వేవ్ ధాటికి విలవిల్లాడుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాల నుంచి సహకారం అందుతూనే ఉంది. ఈ కరోనా మహమ్మారిపై భారత్లో పోరుకు సాయంగా జర్మనీ నుంచి తాజాగా 7 ఆక్సిజన్ ప్లాంట్లు మనదేశానికి వచ్చాయి. జర్మనీ లోని మ్యూనిచ్ నుంచి జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్కు ఇవి సోమవారం నాడు చేరుకున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆక్సిజన్ ప్లాంట్లు రాష్ట్రానికి చేరుకునేలా చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ధన్యవాదాలు తెలిపారు. ‘‘వెయ్యి ఎల్పీఎమ్ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లు 5, 1500 ఎల్పీఎమ్ ఉన్నది ఒకటి, 600 ఎల్పీఎమ్ ఉన్నది ఒకటి రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న సామర్థ్యాన్ని ఇవి మరో 7,100 ఎల్పీఎమ్ పెంచుతాయి’’ అని మనోజ్ సిన్హా తెలిపారు.