70 లక్షల మంది ‘భీమ్’ వినియోగదారుల డేటా లీక్: సైబర్ సెక్యూరీటీ
ABN , First Publish Date - 2020-06-03T02:14:39+05:30 IST
ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రభుత్వ అప్లికేషన్ భీమ్కు సంబంధించిన డేటా లీక్ అయినట్లు...
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రభుత్వ అప్లికేషన్ భీమ్కు సంబంధించిన డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. దేశంలో ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలను పోత్సహించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) భీమ్ యాప్ను ప్రవేశ పెట్టింది. అయితే ఈ అప్లికేషన్ను వినియోగిస్తున్న 70 లక్షల మందికి సంబంధించిన డేటా లీక్ అయినట్లు ఇజ్రాయెల్కు చెందిన వీపీఎన్ మెంటార్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రకటించింది. ఈ డేటా మొత్తాన్ని అమెజాన్కు చెందిన ఎస్3 బకెట్ వెబ్ సర్వీస్లో స్టోర్ చేశారని, దీని నుంచి ఎవరైనా డేటాను తీసుకునే వీలుంటుందని పేర్కొంది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందారు. అయితే ఇలాంటిదేమీ జరగలేదని, భీమ్కు చెందిన ఒక్క వినియోగదారుడి వివరాలు కూడా బయటకు వెళ్లలేదని ఎన్పీసీఐ ప్రకటించింది.