లాడ్జిలో రూ.70 లక్షల సీజ్‌

ABN , First Publish Date - 2021-04-09T06:15:48+05:30 IST

మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బుధవారపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీనివాస లాడ్జిలో భారీగా నగదు లభ్యమైంది.

లాడ్జిలో రూ.70 లక్షల సీజ్‌
స్వాధీనం చేసుకున్న నగదుతో పోలీసులు

  1.  స్థిరాస్తి పత్రాలు స్వాధీనం


కర్నూలు, ఏప్రిల్‌ 8:  మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బుధవారపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీనివాస లాడ్జిలో భారీగా నగదు లభ్యమైంది. సీఐ తబ్రేజ్‌ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం తనిఖీలు చేయగా ఓ గదిలో శ్రీనివాసులు, శ్రీరాములు, సుంకన్న, దామోదర్‌ రెడ్డి, రాజారెడ్డి, మోహన్‌ రెడ్డి అనే వ్యక్తుల వద్ద రూ.75 లక్షల నగదు దొరికింది. నగదుకు ఎలాంటి పత్రాలు చూపించలేదు. దీంతో పాటు కొన్ని స్థిరాస్తి పత్రాలు లభించాయి. నగదును సీజ్‌ చేసి కేసు నమోదు  చేసినట్లు సీఐ తబ్రేజ్‌ తెలిపారు.

Updated Date - 2021-04-09T06:15:48+05:30 IST