ఏపీలో కొత్తగా 7,228 కరోనా కేసులు.. 45 మరణాలు

ABN , First Publish Date - 2020-09-23T22:11:06+05:30 IST

ఏపీలో కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా

ఏపీలో కొత్తగా 7,228 కరోనా కేసులు.. 45 మరణాలు

అమరావతి: ఏపీలో కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 72,838 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,228 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో ఏపీలో 6,46,530కి కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 70,357 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి 5,70,667 మంది కోలుకున్నారని అధికారులు పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 50.02 లక్షల కరోనా టెస్టులు చేశారు. కరోనాతో గడిచిన 24 గంటల్లో 45 మంది మృతి చెందారు. దీంతో  మరణాల సంఖ్య 5,506కు చేరుకుంది. 


చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా 5, తూర్పుగోదావరి, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందారు. బుధవారం కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1112, పశ్చిమగోదావరి జిల్లాలో 962, గుంటూరు జిల్లాలో 648 కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.

Updated Date - 2020-09-23T22:11:06+05:30 IST