కరోనా నివారణకు పటిష్ఠ చర్యలు

ABN , First Publish Date - 2020-04-09T11:02:25+05:30 IST

కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.రామగిడ్డయ్య పేర్కొన్నారు.

కరోనా నివారణకు పటిష్ఠ చర్యలు

జిల్లాలో 75 పాజిటివ్‌ కేసులు

మాస్కులు, కిట్ల కొరత లేదు: డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య



కర్నూలు(హాస్పిటల్‌), ఏప్రిల్‌ 8: కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.రామగిడ్డయ్య పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆయన ఏపీఎంఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటవ్‌ ఇంజనీరు విజయభాస్కర్‌ డీపీఎంవో తిమ్మప్పతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 75 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయనీ, ఈ కేసుల న్నీంటినీ నంద్యాల, విశ్వభారతి, కర్నూలు జీజీహెచ్‌ కోవిడ్‌ హాస్పిట ల్స్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు.


జిల్లాలో విదేశాల నుంచి 848 మంది, ఢిల్లీ సదస్సుకు వెళ్లినవారు 357 మంది ఉన్నారనీ, వీరం దరికీ పరీక్షలు నిర్వహించి 15 క్వారంటైన్‌ సెంటర్లలో చికిత్స అందిస్తు న్నామన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి నుంచి ప్రైమరీ కాంట్రాక్టు ద్వారా 563 మందిని గుర్తించి వీరికి క్వారంటైన్‌లో ఉంచామన్నారు.

Updated Date - 2020-04-09T11:02:25+05:30 IST