డల్లాస్‌లోని గాంధీ మెమోరియల్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2021-08-17T15:20:47+05:30 IST

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్‌‌లోని గాంధీ మెమోరియల్ వద్ద 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగష్టు 15న ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.

డల్లాస్‌లోని గాంధీ మెమోరియల్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

డల్లాస్‌, టెక్సాస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్‌‌లోని గాంధీ మెమోరియల్ వద్ద 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగష్టు 15న ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కోవిడ్ నిభందనలకు లోబడి ప్రవాస భారతీయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించి, భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ గాంధిజీతో సహా ఎంతోమంది జాతీయ నాయకులు, స్వాతంత్ర్య యోధుల త్యాగ ఫలితంగా సాధించికున్న 75 సంవత్సారాల స్వాతంత్ర్య భారతంలో మనం అనేక రంగాలలో ఎంతో ప్రగతి సాధించామని పేర్కొన్నారు. అయినా ఇప్పటికే కొన్ని వేల గ్రామాలల్లో కనీస వసతులైన మంచి నీరు, విద్యుత్, విద్యా, వైద్య సదుపాయాలు లేకపోవడం శోచనీయం అన్నారు. చిత్తశుద్ధితో పాలకులు, అంకిత భావంతో ప్రజలు కలసి పనిచేస్తే తప్ప ఆశించిన అభివృద్ధి సాధించలేమన్నారు. 


విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు స్వదేశాభివృద్ధిలో తమ వంతు కృషితో పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోమహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల, బోర్డు సభ్యులు, కమ్యూనిటీ నాయకులు ఉర్మీత్ జునేజా, సల్మాన్ ఫర్షోరి, దినేష్ హూడా, షబ్నం మోడ్గిల్, ఎం.వి.ఎల్ ప్రసాద్, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, పులిగండ్ల విశ్వనాధం, ములుకుట్ల వెంకట్ పాల్గొన్నారు. పిల్లలు పెద్దలు చిరు జల్లుల మధ్య గాంధీజీకి నివాళులర్పించి, మిఠాయిలు తింటూ ఆహ్లాదంగా గడిపారు.   









Updated Date - 2021-08-17T15:20:47+05:30 IST