మరో 8 మంది మృతి
ABN , First Publish Date - 2021-05-14T04:32:00+05:30 IST
మరో 8 మంది మృతి
910 మందికి వైరస్
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో గురువారం కరోనాకు మరో 8 మంది బలైపోయారు. గడిచిన 24 గంటల్లో 910 మందికి వైరస్ సోకింది. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,479కు చేరింది. మరణాలు 842కు చేరాయి. 9,654 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.