8 మంది బలి
ABN , First Publish Date - 2021-05-18T05:46:36+05:30 IST
8 మంది బలి
396 పాజిటివ్ కేసులు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా మహమ్మారికి సోమవారం మరో 8 మంది బలైపోయారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 396 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 76,665కు చేరింది. మరణాలు అధికారికంగా 872కు పెరిగాయి. ఇంకా 9,891 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.