కుక్కల దాడిలో 8 మేకలు మృతి
ABN , First Publish Date - 2021-03-05T05:39:03+05:30 IST
మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన బీరం నరేష్ అనే వ్యక్తికి చెందిన మేకల మందపై గురువారం కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఎనిమిది మేకలు మృతి చెందాయి.
బోథ్రూరల్, మార్చి4: మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన బీరం నరేష్ అనే వ్యక్తికి చెందిన మేకల మందపై గురువారం కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఎనిమిది మేకలు మృతి చెందాయి. మృతి చెందిన మేకల విలువ సుమారు రూ. 70వేల వరకు ఉంటుందని బాధితుడు నరేష్ కన్నీరు పెట్టుకున్నారు. తమను ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.