మైనర్ బాలికలపై 8 మంది అత్యాచారం.. 2 నెలల తర్వాత బ్లాక్‌మెయిల్‌కు దిగడంతో..

ABN , First Publish Date - 2020-07-31T03:00:33+05:30 IST

మైనర్‌లయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై 8 మంది కామాంధులు అత్యాచారం చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....

మైనర్ బాలికలపై 8 మంది అత్యాచారం.. 2 నెలల తర్వాత బ్లాక్‌మెయిల్‌కు దిగడంతో..

నయారాయ్‌పూర్: మైనర్‌లయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై 8 మంది కామాంధులు అత్యాచారం చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బలోదాబజార్‌ ప్రాంతంలో ఇద్దరు మైనర్ బాలికలు నివశిస్తున్నారు. వారిద్దరిలో అక్క వయసు 16 సంవత్సరాలు కాగా.. చెల్లెలి వయసు 14 సంవత్సరాలు. మార్చి 31వ తేదీన వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి ఇంటికి వస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా దాదాపు 8 మంది యువకులు వారిపై దాడి చేసి మిగతావారందరినీ బెదిరించి తరిమేశారు. అక్కచెల్లెళ్లిద్దరినీ ఎత్తుకెళ్లి వారిపై అత్యాచారం చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టారు. దీంతో వారిద్దరూ నోరు మెదపలేదు. అయితే రెండు రోజుల క్రితం ఇద్దరిలో ఓ బాధితురాలు మహిళా, శిశు అభ్యున్నతి శాఖను ఆశ్రయించింది. తనపై రెండు నెలల క్రితం కొందరు అత్యాచారం చేశారని, తనతో పాటు తన సోదరిపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయింది.


ప్రస్తుతం వారిలో ఒకరు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని, అత్యాచారం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని వాపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం మొత్తం 11 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2020-07-31T03:00:33+05:30 IST