చిన్నారి కిడ్నాప్‌ కలకలం.. సుఖాంతం

ABN , First Publish Date - 2021-01-08T11:58:46+05:30 IST

చిన్నారి కిడ్నాప్‌ కలకలం.. సుఖాంతం

చిన్నారి కిడ్నాప్‌ కలకలం.. సుఖాంతం

హైదరాబాద్/రామంతాపూర్‌ : రామంతాపూర్‌ నెహ్రూనగర్‌లో ఓ చిన్నారి కిడ్నాప్‌ వ్యవహారం కలకలం రేపింది. కిడ్నాప్‌ చేసిన బాలున్ని గంట తర్వాత నిందితుడు ఓ చోట వదిలి వెళ్లడంతో గుర్తించిన బంధువులు చేరదీసి ఇంటికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. వివరాలిలా ఉన్నాయి. నెహ్రూనగర్‌లోని శ్రీనివాస మిల్క్‌ పార్లర్‌ యజమాని తన కొడుకు రుత్విక్‌ యాదవ్‌(8)ను దుకాణంలో ఉంచి భోజనానికి వెళ్లాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి పార్లర్‌కు చేరుకొని మీనాన్న ఐదువేలను ఇవ్వమన్నాడని చెప్పి బాలుడి నుంచి డబ్బు తీసుకొన్నాడు. అనంతరం ఆ బాలుణ్ని మభ్యపెట్టి తనతోపాటు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించి చుట్టూ పక్కలా వెతికారు. గంట తరువాత ఆగంతుకుడు ఆ బాలుణ్ని శ్రీ చైతన్య కళాశాల వద్ద విడిచి వెళ్లాడు. బంధువులు గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ సంఘటనపై పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Updated Date - 2021-01-08T11:58:46+05:30 IST