‘తాజా ఆఫ్ఘన్ నిర్వాసితుల్లో 80 శాతం మంది మహిళలు, బాలికలే’
ABN , First Publish Date - 2021-09-30T01:28:06+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్లో కొత్తగా నిర్వాసితులైనవారిలో 80 శాతం మంది
జెనీవా : ఆఫ్ఘనిస్థాన్లో కొత్తగా నిర్వాసితులైనవారిలో 80 శాతం మంది మహిళలు, బాలికలేనని ఐక్య రాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ (యూఎన్హెచ్సీఆర్) కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుత సంఘర్షణ ప్రభావం మహిళలు, బాలికలపై తీవ్రంగా పడిందని ఐక్య రాజ్య సమితి వ్యవస్థలు చెప్తున్నాయి.
పాకిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, రానున్న చలికాలంలో దాదాపు 3000 మంది ఆఫ్ఘన్ నిర్వాసితులకు ఆశ్రయం, ఇతర సహాయం అందించేందుకు నిధులను యూఎన్హెచ్సీఆర్ వినియోగించబోతోంది.
కోకా-కోలా ఫౌండేషన్ ప్రెసిడెంట్ సాదియా మాట్లాడుతూ, ఇది అనేక రూపాలుగల సంక్షోభమని చెప్పారు. ఈ సంక్షోభంలో మహిళలు, బాలికలు పెద్ద ఎత్తున బాధితులవుతున్నారన్నారు. పాకిస్థాన్లోని ఆఫ్ఘన్ నిర్వాసితులకు ముఖ్యమైన సహాయం చేయడంలో ఈ నిధులు ఉపయోగపడతాయని ఆశిస్తున్నామన్నారు.