ఆవు పేడ చోరీ.. ఎఫ్ఐఆర్ నమోదు..!
ABN , First Publish Date - 2021-06-21T05:25:10+05:30 IST
చత్తీస్గఢ్లోని కోర్బా ప్రాంతంలో ఆవు పేడ చోరి కావడంతో స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
చత్తీస్గఢ్: చత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో ఆవు పేడ చోరి కావడంతో స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాదాపు 1600 రూపాయల విలువ చేసే 800 కేజీల పేడను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకుపోయినట్టు కేసు నమోదైంది. ఈ నెల ఎనిమిదిన జిల్లాలోని ధురేనా అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామాధికారి పోలీసులను ఆశ్రయించారు. గోధన్ న్యాయ్ యోజన పథకం కింద్ర ప్రభుత్వం ఆవు పేడను కిలో రూ. 2లకు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం.. వర్మీ కంపోస్ట్ తయారీ కోసం పేడను సేకరిస్తుంటుంది. గ్రామప్రజల ఆదాయాలు పెంచేందుకు ప్రభుత్వం గతేడాది ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.