834 యూనిట్ల మంజూరు

ABN , First Publish Date - 2020-12-04T05:04:43+05:30 IST

వైఎ్‌సఆర్‌ చేయూత ద్వారా 834 యూనిట్లు మంజూరైనట్లు వైఎ్‌సఆర్‌ చేయూత డీడీ మహేశ్వరుడు అన్నారు.

834 యూనిట్ల మంజూరు
సమావేశంలో మాట్లాడుతున్న డీడీ మహేశ్వరుడు

కొమరోలు, డిసెంబరు 3 :  వైఎ్‌సఆర్‌ చేయూత ద్వారా 834 యూనిట్లు మంజూరైనట్లు వైఎ్‌సఆర్‌ చేయూత డీడీ మహేశ్వరుడు అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం యూనిట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. వైఎ్‌సఆర్‌ చేయూత లబ్ధిదారుడు బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలను సకాలంలో చెల్లించి ఆర్థికంగా నిలబడాలని ఆయన అన్నారు. వైఎ్‌సఆర్‌ చేయూత ద్వారా 75వేలతో గేదె, ఆవు, గొర్రె, మేకలను కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధరరావు, ఏడీ అబ్దుల్‌నాయక్‌, డాక్టర్‌ హరి, ఏపీఎం సైమన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:04:43+05:30 IST