కేరళలో అనూహ్యంగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-05-28T22:53:35+05:30 IST

కేరళలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి...

కేరళలో అనూహ్యంగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

కేరళలో గురువారం కొత్తగా 84 కరోనా కేసులు నమోదు

తిరువనంతపురం: కేరళలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు తిరిగొచ్చిన వారితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. గురువారం కొత్తగా 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రకటించారు. కేరళలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ముగ్గురు కరోనా నుంచి కోలుకుని గురువారం డిశ్చార్జ్ అయినట్లు సీఎం ప్రకటించారు.


కేరళలో ఇప్పటివరకూ 1,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 526. గురువారం నమోదైన 84 కరోనా పాజిటివ్ కేసుల్లో 48 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారని, 31 మంది విదేశాల నుంచి వచ్చిన వారని, మరో ఐదుగురికి ఇతరుల ద్వారా కరోనా సోకినట్లు సీఎం తెలిపారు. గురువారం కరోనా వల్ల ఒకరు మరణించారు. చనిపోయిన వ్యక్తి స్వస్థలం తెలంగాణ రాష్ట్రంగా సీఎం పినరయ్ విజయన్ తెలిపారు.

Updated Date - 2020-05-28T22:53:35+05:30 IST