జీవీఎంసీ పరిధిలో 8,440 టిడ్కో ఇళ్లు రద్దు

ABN , First Publish Date - 2020-07-02T09:34:28+05:30 IST

జీవీఎంసీ పరిధిలో 8,440 టిడ్కో ఇళ్లు రద్దు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నగరానికి మంజూరైన 27 వేల ఇళ్లలో ఎక్కువ శాతం

జీవీఎంసీ పరిధిలో 8,440 టిడ్కో ఇళ్లు రద్దు

విశాఖపట్నం, జూలై 1(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలో 8,440 టిడ్కో ఇళ్లు రద్దు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నగరానికి మంజూరైన 27 వేల ఇళ్లలో ఎక్కువ శాతం శ్లాబ్‌లు వేయగా, మరికొన్ని నిర్మాణాలు పూర్తిచేశారు. ఇంకా ఐదు మురికివాడల్లో 8440 ఇళ్ల నిర్మాణాలు పునాదులతో నిలిచిపోయాయి.


నగరంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల కేటాయింపు జరిగింది. అయితే 8,440 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందజేయాలంటే కొంత సమయం పడుతుందని ప్రభుత్వం భావించింది. అందువల్ల ఈనెల ఎనిమిదిన పేదలకు పట్టాలు ఇస్తున్న నేపథ్యంలో టిడ్కో నిర్మిస్తున్నవాటిలో పునాదులు దాటని 8,440 ఇళ్లు రద్దుచేసి వాటి స్థానంలో పట్టాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. 

Updated Date - 2020-07-02T09:34:28+05:30 IST