ఏపీలో కొత్తగా 8,555 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-08-03T00:41:16+05:30 IST

కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది. రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయే

ఏపీలో కొత్తగా 8,555 కరోనా కేసులు నమోదు

అమరావతి : కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తోంది. రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయే తప్ప కంట్రోల్ అయ్యే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. మరోవైపు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా టెస్ట్‌లు చేస్తుండటంతో కేసులు కూడా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏపీలో కొత్తగా 8,555 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య లక్షా 58వేల 764కు చేరుకుంది. గత 24 గంటల్లో 52,834 శాంపిల్స్ పరీక్షించగా 8,555 కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20,65,407 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు మీడియా బులెటిన్‌లో ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇవాళ నమోదైన కేసుల్లో విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1227 పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగించే విషయం. అంతేకాదు ఇదే జిల్లాలో ఒకే రోజు ఏడుగురు కరోనాతో మృతి చెందారు.


డెత్, డిశ్చార్జ్ లెక్కలివీ..

ఇవాళ ఒక్కరోజే 67 మంది కరోనాతో మృతి చెందడం గమనార్హం. కొత్తగా నమోదైన మరణాలతో కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1474 మంది కరోనాతో చనిపోయారు. ఇవాళ చనిపోయిన వారిలో కృష్ణా జిల్లా-11, గుంటూరులో-08, తూర్పుగోదావరి-07, విశాఖపట్నం-07, కర్నూలు‌-06, నెల్లూరు-06, శ్రీకాకుళం-05, ప్రకాశం-04, చిత్తూరు-03, కడప-03, విజయనగరం-03, అనంతపురం-02, పశ్చిమగోదావరి-02 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కాగా.. గడిచిన 24 గంటల్లో 6,272 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 74,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


ఏ జిల్లాలో ఎన్ని కేసులు..!?





Updated Date - 2020-08-03T00:41:16+05:30 IST