ఒకే బైక్‌పై 87 చలానాలు.. వాహనం సీజ్

ABN , First Publish Date - 2021-03-06T12:28:31+05:30 IST

ఎనభై ఏడు చలానాలు పెండింగ్‌లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు..

ఒకే బైక్‌పై 87 చలానాలు.. వాహనం సీజ్

హైదరాబాద్/ఖైరతాబాద్‌ : ఎనభై ఏడు చలానాలు పెండింగ్‌లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. శుక్రవారం సైఫాబాద్‌ పోలీసులు నిరంకారి చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. హెల్మెట్‌ లేకుండా ద్విచక్రవాహనం(ఏపీ 09 బీటీ 5089)పై వచ్చిన వ్యక్తిని ఆపారు. వాహనంపై 87 చలానాలు, రూ. 20,400 జరిమానా పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి వాహనాన్ని సీజ్‌ చేశారు. వాహన యజమాని ఎంఎస్‌ మక్తాకు చెందిన సాజిద్‌ అని, అతడు తరచూ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని ఎస్‌ఐ మోహన్‌ తెలిపారు. 


Updated Date - 2021-03-06T12:28:31+05:30 IST