పాల్ఘర్ కేసులో 89 మందికి బెయిల్
ABN , First Publish Date - 2021-01-17T08:16:19+05:30 IST
పాల్ఘర్ మూకదాడి కేసు నిందితులకు 89 మందికి మహారాష్ట్ర థానే జిల్లాలోని ప్రత్యేక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది.
థానే, జనవరి 16 : పాల్ఘర్ మూకదాడి కేసు నిందితులకు 89 మందికి మహారాష్ట్ర థానే జిల్లాలోని ప్రత్యేక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణను జిల్లా జడ్జి ఎస్బీ బహాల్కర్ వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేశారు.
ఈ కేసులో మొత్తం 201 మంది అరెస్టు కాగా.. 75 మంది ప్రధాన నిందితులు జైలులో ఉన్నారు.