9 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-05-08T04:58:53+05:30 IST

జమ్మలమడుగు మండలంలోని మోరగుడి- కోవెలకుంట్ల రోడ్డు లోని బొరుగులబట్టి మిల్లులో 9 క్వింటాళ్ల 8 కేజీల రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకు న్నారు.

9 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత
రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు

జమ్మలమడుగు రూరల్‌, మే 7: జమ్మలమడుగు మండలంలోని మోరగుడి- కోవెలకుంట్ల రోడ్డు లోని బొరుగులబట్టి మిల్లులో 9 క్వింటాళ్ల 8 కేజీల రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకు న్నారు. రాబడిన సమాచారం మేరకు...  జమ్మలమడుగు, మై లవరం, పెద్దముడియం, వేప రాల, దొమ్మరనంద్యాల తదితర గ్రామాల నుంచి వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని గోడౌన్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని జమ్మలమడుగు తహసీల్దారు మధుసూదన్‌ రెడ్డికి ప్రజలు ఫిర్యాదు చేశారు. ఆమేరకు  డిప్యూటీ తహసీల్దారు వేణుగోపాల్‌, వీఆర్వో మనోజ్‌  దాడులు చేసి తొమ్మిది క్వింటాళ్ల 8 కేజీల బియ్యాన్ని  సీజ్‌ చేసి ప్రభుత్వ గోడౌన్‌కు తరలించారు.


Updated Date - 2021-05-08T04:58:53+05:30 IST