వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి చేరిన 94 మంది భారతీయులు!

ABN , First Publish Date - 2020-07-10T06:27:39+05:30 IST

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా పాకిస్థాన్‌లో చిక్కుకున్న సుమారు 94మంది భారతీయులు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా గురువారం రో

వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి చేరిన 94 మంది భారతీయులు!

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా పాకిస్థాన్‌లో చిక్కుకున్న సుమారు 94మంది భారతీయులు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా గురువారం రోజు ఇండియాకు చేరుకున్నారు. ఇదే సమయంలో 77 మంది పాకిస్థాన్ పౌరులు కూడా తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు. వివిధ కారణాల వల్ల సుమారు 20 మంది భారతీయులు పాకిస్థాన్‌లో, పాక్ పౌరులు ఇండియాలోనే ఉండిపోయారు. కాగా.. అక్కడ చిక్కుకున్న భారతీయులను మరో రోజు ఇండియాకు తరలించేందుకు  ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న సుమారు 5లక్షల మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నారు. 


Updated Date - 2020-07-10T06:27:39+05:30 IST