97 క్వింటాళ్ల మొక్కజొన్నలు దగ్ధం

ABN , First Publish Date - 2020-05-22T09:42:43+05:30 IST

మండలంలోని జాకారం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 97క్వింటాళ్ల మొక్కజొన్నలు దగ్ధమయ్యాయి. గొర్రె భిక్షపతి, పాక

97 క్వింటాళ్ల మొక్కజొన్నలు దగ్ధం

ములుగు, మే 21: మండలంలోని జాకారం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 97క్వింటాళ్ల మొక్కజొన్నలు దగ్ధమయ్యాయి. గొర్రె భిక్షపతి, పాక నవీన్‌, పాక తిరుపతి పం డించిన మొక్కజొన్నలను విక్రయించేందుకు కాంటాలు నిర్వహించారు.


బస్తాలను తరలించే క్రమం లో అగ్నిప్రమాదం సంభవించి మక్కలన్నీ కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి బాధిత రైతులను పరామర్శించారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-05-22T09:42:43+05:30 IST