ఇంట్లో ఒంటరిగా ఉన్న 16 ఏళ్ల కుర్రాడు.. నిశ్శబ్ధంగా ఉండటంతో పక్కింటి వాళ్లు కిటికీలోంచి చూస్తే..

ABN , First Publish Date - 2021-10-04T21:15:50+05:30 IST

కుటుంబ కలహాల వల్ల ఆ భార్యభర్తలిద్దరూ వేరేవేరుగా ఉంటున్నారు. పదహారేళ్ల కొడుకు తల్లితో కలిసి ఉంటూ, స్థానిక స్కూళ్లో పదో తరగతి చదువుతున్నాడు. ఓ రోజు తల్లి పనిమీద బయటకు వెళ్లగా ఆ కుర్రాడు ఒంటరిగా ఇంట్లోనే ఉన్నాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న 16 ఏళ్ల కుర్రాడు.. నిశ్శబ్ధంగా ఉండటంతో పక్కింటి వాళ్లు కిటికీలోంచి చూస్తే..

జైపూర్: కుటుంబ కలహాల వల్ల ఆ భార్యభర్తలిద్దరూ వేరేవేరుగా ఉంటున్నారు. పదహారేళ్ల కొడుకు తల్లితో కలిసి ఉంటూ, స్థానిక స్కూళ్లో పదో తరగతి చదువుతున్నాడు. ఓ రోజు తల్లి పనిమీద బయటకు వెళ్లగా ఆ కుర్రాడు ఒంటరిగా ఇంట్లోనే ఉన్నాడు. నిశ్చబ్దంగా ఉందేటని అనుమానంతో ఆ ఇంటి కిటికిలోంచి పక్కింటి వాళ్లు లోపలికి చూశారు. అక్కడ కనిపించిన సీన్ చూసి నివ్వెరపోయారు. పూర్తి వివరాల్లోకెళ్తే..


రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్  ప్రాంతానికి చెందిన చిరాగ్ పండోర్.. తల్లి పారు పండోర్‌తో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఆదివారం తల్లి పని నిమిత్తం బయటికి వెళ్లగా చిరాగ్ ఒంటరిగా ఇంట్లోనే ఉన్నాడు. ఇల్లు నిశ్చబ్దంగా ఉండడం గమనించి పక్కింటి వాళ్లు అనుమానంతో కిటికిలోనుంచి చూశారు. అక్కడ చిరాగ్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. అది చూసి వారు షాకయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు, బయటికి వెళ్లిన తల్లి పారుకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. 


అక్కడ వారికి ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ‘నాకు జీవితం మీద విరక్తి కలిగింది’ అని రాసి ఉంది. అది స్వాధీనం చేసుకున్న పోలీసులు బాధితుడి ఇతర కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన తల్లి కుమారుడిని విగతజీవిగా చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. తమ బంధువులు వచ్చేదాకా మృతదేహాన్ని దించకూడదని బాధితుడి తల్లి పోలీసులను కోరింది. దీంతో గదిని సీల్ చేసిన పోలీసులు రాత్రంతా వేచి చూసి, ఉదయం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-04T21:15:50+05:30 IST