అర్ధరాత్రి నిద్రలేచిన తల్లి.. ఇంటి బయట అలికిడి విని వెళ్తే ఓ కుర్రాడితో కనిపించిన కూతురు.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..!

ABN , First Publish Date - 2021-10-08T02:11:14+05:30 IST

కుటుంబ సభ్యులు అందరూ కలిసి రాత్రి భోజనం చేసి పడుకున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా ఏదో అలికిడి కావడంతో ఆ తల్లి నిద్ర లేచింది. పక్కనే ఉండాల్సిన కూతురు కనిపించలేదు. దీంతో ఆమె కాస్త కంగారు పడి.. బయటికి వెళ్లి చూసింది. అక్కడ తన కూతరు ఓ

అర్ధరాత్రి నిద్రలేచిన తల్లి.. ఇంటి బయట అలికిడి విని వెళ్తే ఓ కుర్రాడితో కనిపించిన కూతురు.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..!

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ సభ్యులు అందరూ కలిసి రాత్రి భోజనం చేసి పడుకున్నారు. అందరూ గాఢ నిద్రలో ఉండగా ఏదో అలికిడి కావడంతో ఆ తల్లి నిద్ర లేచింది. పక్కనే ఉండాల్సిన కూతురు కనిపించలేదు. దీంతో ఆమె కాస్త కంగారు పడి.. బయటికి వెళ్లి చూసింది. అక్కడ తన కూతరు ఓ కుర్రాడితో కనిపించడం చూసి ఆమె షాకైంది. అనంతరం విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో ఆగ్రహానికి లోనైన అతడు.. కోపంగా ఇంటి బయటికి వచ్చాడు. అనంతరం ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌పూర్‌కు చెందిన దంపతులు తమ 17ఏళ్ల కూతురు కనిపించడం లేదంటూ అక్టోబర్ 4న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే జబల్‌పూర్ పరిసర ప్రాంతంలో సదరు దంపతుల కూతురి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విషయాన్ని దంపతులకు తెలియజేశారు. ఈ క్రమంలో సదరు యువతి తల్లిదండ్రులు.. తమ ఇంటి పక్కన ఉండే దేవేంద్ర చౌదరి అనే కుర్రాడిపై ఫిర్యాదు చేశారు. అతడే తమ కూతురిపై అత్యాచారం చేసి, చంపేసి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవేంద్ర చౌదరి కూడా కనబడకుండా పోవడంతో పోలీసులు అతడిపై పోస్కో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల చేతికి పోస్ట్‌మార్టం రిపోర్ట్ అందింది. అందులో సదరు దంపతుల కూతురుపై అత్యాచారం జరగలేదని వెల్లడైంది. అంతేకాకుండా ఆమెను ఎవరో బలంగా కొట్టి.. చంపేసినట్లు రిపోర్ట్‌లో తేలింది. దీంతో పోలీసులు పునరాలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే సదరు యవతి తండ్రిని పోసులు తమ స్టైల్‌లో విచారించారు. దీంతో అతడు అసలు నిజం చెప్పాడు. 



అక్టోబర్ 3న రాత్రి తన కూతురు దేవేంద్ర చౌదరి‌తో మొదటగా తన భార్య చూసిందని వెల్లడించాడు. తర్వాత ఆ విషయం తనకు చెప్పడంతో.. ఆగ్రహానికి లోనైనట్లు తెలిపాడు. తాను కోపంతో బయటకు రావడాన్ని చూసి, దేవేంద్ర చౌదరి అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించాడు. అనంతరం తన కూతురిని తానే.. చితకబాది, ఆ తర్వాత హత్య చేసినట్లు వెల్లడించాడు. అనంతరం శవాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి.. ఎవరో ఉరేసి హత్య చేసినట్లు సీన్ క్రియేట్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే మరుసటి రోజు ఉదయం వచ్చి.. పోలీసు స్టేషన్‌లో కంప్లైట్ ఇచ్చినట్లు వివరించాడు. 


Updated Date - 2021-10-08T02:11:14+05:30 IST