40ఏళ్ల మహిళతో స్నేహం.. ఆ తర్వాత ప్రేమలోకి దించి అతడు చేసిన నిర్వాకమిది!

ABN , First Publish Date - 2021-10-03T21:41:19+05:30 IST

అతడు మొదట ఆమెతో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఫోన్లలో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపారు. ఈ క్రమంలోనే ఆమెను ప్రేమిస్తున్నాని చెప్పాడు. చాలాసార్లు బయట కలవమని బలవంతం చేశాడు. ఇలా చాలా కాలంగా వారిద్దరి స్నేహం కొనసాగింది.

40ఏళ్ల మహిళతో స్నేహం.. ఆ తర్వాత ప్రేమలోకి దించి అతడు చేసిన నిర్వాకమిది!

అతడు మొదట ఆమెతో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఫోన్లలో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపారు. ఈ క్రమంలోనే ఆమెను ప్రేమిస్తున్నాని చెప్పాడు. చాలాసార్లు బయట కలవమని బలవంతం చేశాడు. ఇలా చాలా కాలంగా వారిద్దరి స్నేహం కొనసాగింది. ఆ తర్వాత అతడు చేసిన నిర్వాకమేంటో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


జైపూర్‌కు చెందిన రాంనారాయణ్ ఓ 40ఏళ్ల మహిళతో మొదట పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరు తరచూ ఫోన్లు చేసుకుని మాట్లాడుకునేవారు. ఇలా చాలా కాలం వారిద్దరి స్నేహం కొనసాగింది. ఈ క్రమంలోనే అతడు ఆ మహిళను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. తనతో సహజీవనం చేయమని కోరాడు. ఈ విషయంలో ఆమెను చాలా ఒత్తిడి చేసేవాడు. చివరకు ఆమె అతడిని నమ్మి, సరేనని ఒప్పుకుంది. 


ఓ రోజు రాంనారాయణ కల్వద్‌లో ఉన్న తన ఇంటికి ఆ మహిళను తీసుకుని వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతని స్నేహితులకు ఫోన్ చేశారు. అక్కడ వారందరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత రాంనారాయణ మొదట ఆమెపై అత్యాచారం చేశాడు. అపుడు అతని స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దాడిచేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. తర్వాత ఆమెను అక్కడే వదిలిపెట్టి అతడు స్నేహితులతో పరారయ్యాడు. దీంతో సదరు మహిళ రాంనారాయణ్ తనను నమ్మించి మోసం చేసి, తనపై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని కల్వద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.


Updated Date - 2021-10-03T21:41:19+05:30 IST