‘కరోనా’ నివారణ నిధికి భిక్షగాడి చేయూత

ABN , First Publish Date - 2020-05-19T17:15:34+05:30 IST

‘కరోనా’ నివారణ నిధికి భిక్షగాడి చేయూత

‘కరోనా’ నివారణ నిధికి భిక్షగాడి చేయూత

చెన్నై: భిక్షమెత్త సంపాదించిన రూ.10 వేల నగదును ఓ వృద్ధుడు ‘కరోనా’ నివారణ నిధికి అందజేశాడు. తూత్తుకుడి జిల్లా ఆలంకినరుకు చెందిన పూల్‌ పాండియన్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటూ, తన ఖర్చులకు పోగా మిగిలిన సొమ్మును పొదుపు చేస్తుంటాడు. పొదుపు చేసిన సొమ్ముతో పలు పాఠశాలలకు టేబుళ్లు, కుర్చీలు, నీటి శుద్ధీకరణ యంత్రాలను తదితరాలను పాఠశాల నిర్వాహకులకు అందిస్తూ సమాజ సేవ చేస్తుంటాడు. మూడు నెలల క్రితం మదురైకి వచ్చిన పాండియన్‌ పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా రోడ్డు పక్కన ఉంటున్న అతనిని కార్పొరేషన్‌ అధికారులు నిర్వాసితుల శిబిరానికి తరలించారు. తాజాగా తాను పొదుపు చేసిన రూ.10 వేలను కరోనా నివారణ నిధికి అందజేయాలని పాండియన్‌ అధికారులకు అందజేశాడు.

Updated Date - 2020-05-19T17:15:34+05:30 IST