యాదాద్రిలో యాత్రాజనుల కోలాహలం

ABN , First Publish Date - 2021-01-17T05:44:36+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షే త్రంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది.

యాదాద్రిలో యాత్రాజనుల కోలాహలం
బాలాలయంలో భక్తుల సందడి

వ్రతపూజల్లో పాల్గొన్న భక్తులు 219 మంది దంపతులు

యాదాద్రి టౌన్‌, జనవరి 16: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షే త్రంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. వరంగల్‌ జిల్లాలోని ఐనవోలు ఆలయాన్ని సందర్శించిన భక్తులతో పాటు సంక్రాంతి సెలవుల నుంచి తిరుగు ప్రయాణంలో యాదాద్రీశుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేం దుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండపైన, కొండకింద భక్తుల రద్దీ నెల కొంది. పట్టణంలో ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి.  సత్యనారా యణ స్వామి వ్రత పూజల్లో సుమారు 219మంది దంపతులు పాల్గొన్నారు. కాగా స్వామికి శనివారం భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.15,70,541 ఆదాయం సమకూరినట్లు దేవస్ధాన అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-17T05:44:36+05:30 IST