ఏనుగు దాడిలో పశువుల కాపరి మృతి
ABN , First Publish Date - 2021-01-18T09:09:04+05:30 IST
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో ఆదివారం ఏనుగు దాడిలో పశువుల కాపరి మృతిచెందాడు.
పూతలపట్టు, జనవరి 17: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో ఆదివారం ఏనుగు దాడిలో పశువుల కాపరి మృతిచెందాడు. తలపలపల్లె పంచాయతీ దుగ్గానిగుండ్లపల్లెకు చెందిన కొందరు గ్రామ సమీపంలోని నందికొండ వద్ద పశువులు మేపుతుండగా ఒంటరి ఏనుగు ఆదివారం సాయంత్రం వారిపై దాడికి దిగింది. అంతా భయంతో పరుగులు తీశారు. పరుగెత్తలేని దివ్యాంగుడైన అబ్బులన్న (60)పై ఏనుగుదాడి చేసి చంపేసింది. ఎస్ఐ రాజ్కుమార్, అటవీశాఖ అధికారులు గ్రామాల్లో పికెట్ ఏర్పాటు చేశారు.