వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-10-17T06:43:25+05:30 IST

భార్య అదృశ్యంపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివాహిత అదృశ్యంపై  కేసు నమోదు

అమలాపురం టౌన్‌, అక్టోబరు 16: భార్య అదృశ్యంపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాకుళం జిల్లా కోరుమామిళ్ల మండలం చినసాని పంచా యతీకి చెందిన సురేష్‌ కుటుంబం జీవనోపాధి కోసం అమలాపురంలోని  శ్రీసిద్ధివినాయక గ్రాండ్‌ ఫంక్షన్‌హాల్‌లో పనిచేసేందుకు రెండునెలల క్రితం వచ్చారు. సురేష్‌ భార్య నీలిమ అలియాస్‌ భరాత్‌(24), మేనమామ కుటుంబం  ఇక్కడే  పనిచేస్తుంది. నీలిమ అక్కడే పనిచేస్తున్న జి.నరేంద్రతో చనువుగా ఉండడాన్ని గుర్తించి కుటుంబ సభ్యులు మందలించారు. ఈనెల13న నీలిమ కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరేంద్ర కూడా కనిపించడం లేదన్నారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాజీలాల్‌  తెలిపారు. 



Updated Date - 2021-10-17T06:43:25+05:30 IST