ఇసుకెళ్లిపోతోంది!

ABN , First Publish Date - 2021-09-29T06:33:22+05:30 IST

ట్రాక్టర్లతో ఇసుక తోడేసి పొలాల్లో డంపింగ్‌ చేసినా పట్టించుకునే నాథుడే లేడు. సోమల మండలం నుంచి ఇసుక భారీస్థాయిలో బయటి ప్రాంతాలకు తరలిపోతోంది.

ఇసుకెళ్లిపోతోంది!
సీతమ్మ చెరువు వంకలో ఇసుక నింపుతున్న కూలీలు

సోమల వంకల నుంచి తరలించి రామకృష్ణాపురం పొలాల్లో నిల్వ 

ట్రాక్టరు లోడు రూ.4వేల చొప్పున బయటి ప్రాంతాలకు తరలింపు 


పుంగనూరు, సెప్టెంబరు 28:  ట్రాక్టర్లతో ఇసుక తోడేసి పొలాల్లో డంపింగ్‌ చేసినా పట్టించుకునే నాథుడే లేడు.  సోమల మండలం నుంచి ఇసుక భారీస్థాయిలో బయటి ప్రాంతాలకు తరలిపోతోంది.ఆవులపల్లె సమీ పంలోని సీతమ్మ చెరువు వంక ప్రాంతంలోని చెరువు పొద - బైరెడ్డిపల్లె మధ్య గల వంకలో ఎక్సకవేటర్లతో ట్రాక్టర్లకు ఇసుక నింపి తరలిస్తున్నారు. రామకృష్ణాపురం ప్రాంతంలోని పొలాల్లో వందల లోడ్ల ఇసుకను నిల్వ చేసి సోమలతో పాటు చౌడేపల్లె, కలికిరి ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు.అడిగితే జగనన్న కాలనీల నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలని చెబుతూ ఇష్టారాజ్యంగా ఇసుక తరలించి లోడు రూ.4వేల చొప్పున విక్రయిస్తున్నారు.కొందరు రాత్రి వేళల్లో లారీల ద్వారా బయటప్రాంతాలకు తరలిస్తున్నారు.అధికారుల వద్ద వైసీపీ బడా నేతల పేర్లు చెప్పుకుంటూ ఇసుక వ్యాపారాలను నిర్విరామంగా సాగిస్తున్నారు.

Updated Date - 2021-09-29T06:33:22+05:30 IST