లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో రాజీవ్‌రహదారిపై వరుసగా వాహనాల ఢీ

ABN , First Publish Date - 2022-01-17T05:30:00+05:30 IST

మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్‌ రహదారిపై సోమవారం వరుసగా వాహనాలు ఢీకొనడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో రాజీవ్‌రహదారిపై వరుసగా వాహనాల ఢీ
రహదారిపై నిలిచిపోయిన వాహనాలు, కారు ఢీకొనడంతో పొదల్లోకి దూసుకెళ్లిన ఆటో

 ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం.. పలువురికి  స్వల్ప గాయాలు

కొండపాక, జనవరి 17: మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్‌ రహదారిపై సోమవారం వరుసగా వాహనాలు ఢీకొనడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ దుద్దెడ శివారులో రాజీవ్‌ రహదారిపై నుంచి వెళ్తూ రెండు కార్ల మధ్య నుంచి అజాగ్రత్తగా అతి వేగంగా దూసుకుపోయి ఒకదాని తర్వాత మరో కారుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ కారు ముందున్న ఆటోను ఢీ కొనడంతో అది రోడ్డు కిందకు దూసుకెళ్లింది. దీంతో  ఆటోలో ఉన్న పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటనతో హైదరాబాద్‌ వైపు వెళ్లే రహదారిపై వాహనాలన్నీ నిలిచిపోయి కొంత సేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ఈ సమాచారమందుకున్న టోల్‌ గేట్‌ హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది, పోలీసులు చేరుకొని ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.

Updated Date - 2022-01-17T05:30:00+05:30 IST