ఏడాది క్రితమే పెళ్లి.. అంతలోనే విడాకులు.. రెండో పెళ్లి చేసుకున్న మాజీ భార్య ఇంటికి ఆ మొదటి భర్త వెళ్లి..

ABN , First Publish Date - 2021-08-11T17:34:44+05:30 IST

వారిద్దరికీ ఏడాది క్రితమే వివాహం జరిగింది.. భర్త తీరు నచ్చని భార్య అతడి నుంచి విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకుంది..

ఏడాది క్రితమే పెళ్లి.. అంతలోనే విడాకులు.. రెండో పెళ్లి చేసుకున్న మాజీ భార్య ఇంటికి ఆ మొదటి భర్త వెళ్లి..

వారిద్దరికీ ఏడాది క్రితమే వివాహం జరిగింది.. భర్త తీరు నచ్చని భార్య అతడి నుంచి విడాకులు తీసుకుని మరో పెళ్లి చేసుకుంది.. దీంతో ఆమెపై పగ తీర్చుకోవాలని భర్త డిసైడ్ అయ్యాడు.. తనకు దక్కనిది వేరెవరికీ దక్కకూడదనుకున్నాడు.. ఆమె ఇంటికి వెళ్లి కత్తితో పొడిచేశాడు.. ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉంది.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


జబల్పూర్‌కు చెందిన కాజల్ అహిర్వార్ గతేడాది మార్చిలో రామ్‌కేష్‌ను వివాహం చేసుకుంది. అయితే అతడు తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి కాజల్‌ను కొడుతూ ఉండేవాడు. అతడి ప్రవర్తనతో విసిగి పోయిన కాజల్ ఆరు నెలల క్రితం అతడి నుంచి విడాకులు తీసుకుంది. మూడు నెలల క్రితం ధర్మేంద్ర అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ విషయం తెలుసుకున్న రామ్‌కేష్ పగ తీర్చుకోవాలనుకున్నాడు. 


సోమవారం రాత్రి ధర్మేంద్ర, కాజల్ నివసిస్తున్న ఇంటికి తన స్నేహితులు వినోద్, రిషితో కలిసి రామ్‌కేష్ వచ్చాడు. ఆ సమయంలో కాజల్ నిద్రపోతోంది. తిన్నగా బెడ్రూమ్‌లోకి వెళ్లిన రామ్‌కేష్.. కాజల్‌తో గొడవపడ్డాడు. అనంతరం కత్తి తీసి ఆమె గొంతు కోసేశాడు. అనంతరం అక్కణ్నుంచి పారిపోయాడు. కాజల్ అరుపులు విన్న ఆమె వదిన వెంటనే అక్కడకు వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాజల్ నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్న పోలీసులు రామ్‌కేష్, అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.  


Updated Date - 2021-08-11T17:34:44+05:30 IST