రోడ్డు ప్రమాదంలో కంతేటివారిపాడు వాసి మృతి

ABN , First Publish Date - 2021-04-13T06:49:09+05:30 IST

రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో కంతేటివారిపాడు వాసి మృతి

పాలకొల్లు రూరల్‌, ఏప్రిల్‌ 12: రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో  ఓ వ్యక్తి మృతి చెందాడు. సఖినేటిపల్లి మండలం కంతేటివారిపాడు గ్రామస్థుడు కుడి పూడి శ్రీనివాస్‌ భీమవరం పైపు వెళుతుండగా ఫోన్‌ రావడంతో రోడ్డు ప్రక్కన ఆగి మాట్లాడుతున్నాడు. వీరవాసరానికి చెందిన చేవూరి నాగమో హనరావు వెనుక నుంచి మోటారు సైకిల్‌తో ఢీకొట్టాడు. నాగమోహనరావు (52) తీవ్రంగా గాయపడ్డాడు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. గాయపడిన శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు సీఐ సీహెచ్‌.ఆంజనేయులు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నామని ఎస్‌ఐ రెహ్మాన్‌ తెలిపారు.  


Updated Date - 2021-04-13T06:49:09+05:30 IST