పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-17T06:41:33+05:30 IST

పురుగుల మందు తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పుచ్చల్లంకకు చెందిన బూరుగు ఏడుకొండలు(47) నాలుగేళ్లుగా మండలంలోని నాగుల్లంకలో నివాసం ఉంటున్నాడు.

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

పి.గన్నవరం, అక్టోబరు 16: పురుగుల మందు తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు.  పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పుచ్చల్లంకకు చెందిన బూరుగు ఏడుకొండలు(47) నాలుగేళ్లుగా మండలంలోని నాగుల్లంకలో నివాసం ఉంటున్నాడు. ఈనెల14న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు చింటు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.  



Updated Date - 2021-10-17T06:41:33+05:30 IST