చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-09T07:30:18+05:30 IST

అంబాజీపేట టీడీపీ గ్రామ శాఖ కార్యదర్శి శ్రీను కొవిడ్‌తో మృతిచెందారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

అంబాజీపేట, మే 8:  అంబాజీపేట టీడీపీ గ్రామ శాఖ కార్యదర్శి శ్రీను కొవిడ్‌తో మృతిచెందారు. పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు. దండోర మం డల నాయకులు విచారం వ్యక్తం చేశారు. 

 మాజీ సర్పంచ్‌ కొండయ్య మృతి

ఆత్రేయపురం, మే 8:హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వద్దిపర్రు మాజీ సర్పంచ్‌, టీడీపీ నాయకుడు ఉప్పే కొండయ్య కొవిడ్‌తో శనివారం మృతిచెందారు.  నియోజకవర్గ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు పల్లికొండ వజ్రకుమార్‌, టీడీపీ అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జీ, పల్లికొండ సుధీర్‌, పాళింగి రవిచంద్ర తదితరులు సంతాపం తెలిపి కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో  కొండయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.



Updated Date - 2021-05-09T07:30:18+05:30 IST